కసబ్ గాడికి పాకిస్దాన్ లాయర్ కావాలట

కసబ్ గాడికి పాకిస్దాన్ లాయర్ కావాలట.
ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంతకాలం కసబ్ లాంటి వాళ్ళు ఏమైనా అడుగుతారు.... వీళ్ళూ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే మరి మైనార్టీ ఓట్లు పోతాయిగా... ఇంతకుముందూ ఇలాగే Masood Azhar ని వదిలారు. వాడ్ని విడిపించుకోడానికి ఏకంగా ఒక విమానాన్నే హైజాక్ చేశారు. వాడు ఇప్పుడు పాకిస్దాన్ లో పడుకుని అక్కడ మిలిటెంట్లకు ట్రైనింగ్ ఇచ్చి ఇండియా మీద దాడులకు పంపుతున్నాడు. Gouru Venkata Reddy ని విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించి పంతం నెగ్గించుకుందో అందరికీ తెలిసిందే. వాడితో పాటూ పనిలో పనిగా ఒక మిలిటెంట్ పైనా దయ తలిచి వదిలేసారు.
తర్వాత అఫ్జల్ గురు. కాంగ్రెస్ గవర్నమెంట్ పుణ్యాన ఇంకా బ్రతికి ఉన్నాడు. వాడ్ని ఉరితీసే విషయంలో వీరికి మనసు రావట్లే. కాని కరెంటు అడిగినప్పుడు, భూములు అడిగినప్పుడు మాత్రం మన రైతుల్ని కుక్కల్ని కాల్చినట్లు కాల్చి చంపారు. వాడి ప్రాణానికి ఉన్న విలువ మన రైతుల ప్రాణాలకు లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు. కసబ్ ని స్వయానా వాళ్ల నాన్న లష్కర్ ఎ తోయ్ బా లో చేరమని సలహా ఇచ్చాడట. Faridkot in Chipaalpura taluka of Ukhad zilla in Punjab (Pakistan) వీడుండే ప్రాంతం. Anjali Waghmare కసబ్ తరపున ప్రస్తుతం వాదిస్తున్న లాయర్. ఇప్పుడు వీడికి పాకిస్దాన్ లాయర్ కావాలట.

No comments:

Post a Comment